PALASA : రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు, రేపు అన్ని డిపోలలో జరిగిన డిమాండ్స్ డే సందర్భంగా పలాస డిపో లో అధిక సంఖ్య లో NMUA కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
డిమాండ్స్: విద్యుత్ బస్ లను RTC/ప్రభుత్వం ద్వారా కొనుగోలుచేయాలి మరియు RTC సిబ్బంది తో నే నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
స్త్రీ శక్తి బస్ లలో zero టికెట్ ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేసి మిగిలిన ప్రయాణికులకు టికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని సిబ్బంది పై పని భారం తగ్గించాలి.
PRC కమిటీని నియమించివెంటనే IR ను ప్రకటించాలి మరియు పెండింగ్ లో ఉన్న 4 DA లు అరియర్స్ మరియు లీవ్ ఎన్కాష్మెంట్ లు ఇవ్వాలి.
13/05/2026 నాడు ప్రభుత్వానికి మరియు గౌరవ ఎండి గారికి ఇచ్చిన మెమొరాండం లోని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి. ప్రయాణికులకు సరిపడ కొత్త బస్ లు వెంటనే కొనుగోలు చేయాలి.
అన్ని కేటగిరీ లలో ఖాళీలను భర్తీ చేయాలి. రిటైర్ అయిన చనిపోయిన సిబ్బందికి వెంటనే సెటిల్ మెంట్స్ చెయ్యాలి. APPTD ఉద్యోగులకు EHS నుంచి మినహాయించి గతంలో RTC నందు ఉన్న వైద్య సదుపాయం అమలు చేయాలి.
ఈ కార్యక్రమంలో గ్యారేజ్ అధ్యక్ష , కార్యదర్శులు శ్రీ పున్నయ్య గారు, డి ఎల్ నారాయణ గారు, వి గణపతి గార్లతో పాటు సీనియర్ నాయకులు శ్రీ టి డి రావు గారు మరియు NMUA కుటుంబ సభ్యులు అధిక సంఖ్య పాల్గొన్నారు.
