పార్వతీపురం మన్యం జిల్లా : వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బాసురు గ్రామానికి చెందిన ఉపాధి కూలీ కోమటి పుష్ప నాదం, 62 సంవత్సరాలు వడదెబ్బకు గురై అక్కడికక్కడే మరణించారు. ఈయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతులు పుష్పనాదం మరణ వార్త విని బాసూరు గ్రామ వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. తోటి ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలు అంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మరియు ఉపాధి హామీ పథకం పథక సంచాలకులు కె. రామచంద్రరావు లు మరణ వార్త తెలిసిన వెంటనే స్పందించి, మృతిని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది అంతా సంతాపం వ్యక్తం చేశారు. గ్రామవాసులు శోకసంద్రంలో మునిగిపోయారు.
