ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో పలాస బస్ డిపోలో ఆర్వో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి శ్రీ శాసనపూరి మురళి గారు (డిస్ట్రిక్ట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ) గారి, ఆర్ధిక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది.
నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ను గౌరవ శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారు తన చేతుల ప్రారంభించి ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ప్రోత్సహించబడతాయని తెలిపారు. ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
పలాస బస్ డిపోకు రోజువారీగా వచ్చే ప్రయాణికులు, సిబ్బంది ఈ ప్లాంట్ ద్వారా లబ్ధి పొందనున్నారని అధికారులు తెలిపారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి సహకరించిన మురళి గారిని ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో, CVAPu team members మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్టీసీ సిబ్బంది, స్థానిక నాయకులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
