13 నుండి చింతామణి అమ్మవారు మహా సంబరాలు..
కవిటి మండల కేంద్రం కవిటిలో కొలువైయున్న ఉద్దానం ఇలవేలుపు, శ్రీ చింతామణి అమ్మవారి మహా సంబరాలు ఈనెల 13వ తేదీ నుండి ప్రారంభమై జూన్ 2 వ తేదీతో ముగుస్తాయని సంబరాల నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సంబర మహోత్సవాల్లో భాగంగా, 10వ తేదీన శుభంరాట కార్యక్రమంతో మొదలై 13 వ తేదీ రాత్రి అమ్మవారిని మేళ తాళాలతో బాణాసంచా కాంతులు నడుమ గ్రామానికి ఘనంగా తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం గ్రామంలో కొలువైన అమ్మవారిని పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాలకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంలో అమ్మవారితో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఊరేగింపు ఘనంగా నిర్వహించడంతోపాటు. భారీ స్టేజి ప్రోగ్రాములను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంబరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారి అనుమతులు తీసుకొని వచ్చిన ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ సంబరాలు సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన అందరి ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు తీసుకొని సంబరాలకు ముందస్తుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంబరాల నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
